జగన్-రఘురామకు చెడింది అక్కడే-సీక్రెట్ బయటపెట్టిన మంత్రి.! అసలైన కథ ఇదే!
Sun Apr 20, 2025 18:51 Politics
ఏపీ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. గతంలో వైసీపీ తరఫున నరసాపురం నుంచి ఎంపీగా గెలిచి, ఆరు నెలల్లోనే అధినేత జగన్ తో విభేధించి నాలుగేళ్ల పాటు పోరాటం చేసి టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు రఘురామకృష్ణంరాజు. అయితే జగన్ కూ, ఆయనకూ మధ్య ఏం జరిగిందనే విషయం మాత్రం ఎవరికీ పూర్తిగా తెలియలేదు. కానీ ఇవాళ చంద్రబాబు కేబినెట్ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ రహస్యం బయటపెట్టారు. ఇవాళ కృష్ణాజిల్లాలో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ తన మాజీ బాస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని అడిగిన జగన్ ను నమ్మి ప్రజలు ఓటేస్తే, రాష్ట్ర ప్రజలకు నరకయాతన చూపించాడన్నారు. గతంలో 10 సంవత్సరాలు వైసీపీలో ఉన్నానని గుర్తుచేసుకున్నారు. జగన్ బ్యాక్ గ్రౌండ్ లో ఉండి, నలుగురు నాయకులు చేత కథ మొత్తం నడిపిస్తాడని సుభాష్ వెల్లడించారు. గతంలో రఘురామ కృష్ణం రాజు తనను సార్ అని సంభోదించలేదని, జగన్ ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు అని ఆయనపై కక్ష పూరితంగా వ్యవహారించాడంటూ అసలు నిజం బయటపెట్టారు.
ఇది కూడా చదవండి: షాకింగ్ న్యూస్.. పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు! ఎస్సైకి సస్పెన్షన్ వేటు!
2024 ఎన్నికల ముందు తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాను అని కబురు పంపారని, ఆ సందర్భంలో అక్కడే ఉన్న ధనుంజయ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సాష్టాంగ నమస్కారం చేయాలని ఆదేశించాడని సుభాష్ తెలిపారు. జగన్ కు సాష్టాంగ నమస్కారాలు ఇష్టమని, మీ కులానికి సంబంధించిన మంత్రి కూడా అదే చేస్తారని ధనుంజయరెడ్డి తనకు చెప్పినట్లు మంత్రి సుభాష్ తెలిపారు. తనకు మతిపోయి తింగరి చూపులు చూసి వెనక్కి తిరిగి వచ్చేసానన్నారు. ఆరోజు ఎమ్మెల్సీ పదవి కోసం సాష్టాంగ నమస్కారాలు చేసి ఉంటే ప్రజలు తనను రాళ్లు పెట్టి కొట్టేవారన్నారు. వైసీపీ పార్టీలో కార్యకర్తగా ఉన్నప్పుడు కూడా ప్రశ్నిస్తే, తన పైన కేసులు పెట్టేవారని గుర్తుచేసుకున్నారు. మరోవైపు 11 సీట్లకే పరిమితం అయ్యేసరికి జగన్ మానసిక వ్యాధికి గురయ్యారంటూ మంత్రి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లండన్ మందులు వికటించాయి కాబట్టే, ఎన్నికల తర్వాత పిచ్చివాగుడు వాగుతున్నాడన్నారు.మగవాళ్ళు అందంగా ఉంటారు అని పిచ్చివాగుడు వాగుతున్నాడన్నారు. ఇదేవిధంగా కొనసాగితే పిచ్చి ఆస్పత్రికి తరలించడం ఖాయమన్నారు. కుటుంబ ఆస్తి కోసం, సొంత కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెడుతున్న వ్యక్తి జగన్ అని సుభాష్ ఆరోపించారు. చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తి ఆమెకు ఇవ్వకుండా దెబ్బలాడుతున్నాడన్నారు. చంద్రబాబు లాంటి మహనీయులైన వ్యక్తి పుట్టినరోజు నాడు, జగన్ గురించి ప్రస్తావించడం రావడం దౌర్భాగ్యం అంటూ ముగించారు.
ఇది కూడా చదవండి: జగన్ గుండెల్లో గుబులు.. వలసబాటలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి రోజా! ఆ పార్టీలోకి అడుగు..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
మంత్రితో పాటు పార్టీ నేతలకు తప్పిన ప్రమాదం! పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే..
ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!
వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..
తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టి, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!
బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!
అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!
మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!
బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!
వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#andhrapravasi #JaganRaghuramFallout #MinisterRevealsSecret #PoliticalDrama #BreakingNews #APPolitics
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.